తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా నరసరావుపేట పట్టణం 04 వ వార్డు ఎన్నికలు ముగిశాయి. పార్టీ నియమ నిబంధనలు కు లోబడి వార్డ్ అధ్యక్షులు, వార్డ్ కమిటీ కార్యవర్గం, వార్డ్ తెలుగు రైతు, వార్డ్ తెలుగు యువత, వార్డ్ మహిళా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఆహ్వానితులుగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఆయనతో బాటు తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లెపు నాగేశ్వరరావు, గొట్టిపాటి జనార్దన్ బాబు, యాడ్స్ వాలి, శ్రీను పరిశీలకులుగా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నిక అయిన కమిటీ సభ్యులకు చదలవాడ అరవింద బాబు శుభాకాంక్షలు తెలియచేశారు.