అనారోగ్యంతో ఆసుప్రతిలో చేరి చికిత్స చేయించుకోవడానికి ఆర్ధిక స్తోమత లేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను కొల్లాపూర్ ఎం ఎల్ ఏ బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు పంపిణీ చేశారు. అనారోగ్యంతో హైద్రాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందిన పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన G. నాగరాజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2,00,000 CMRF LOC ని ఎం ఎల్ ఏ బాధితుల కుటుంబ సభ్యులకు అందచేశారు.
అదే విధంగా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన మల్లెపల్లి సరస్వతీ కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన CMRF LOC రూ. 2,00,000 లుకూడా కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు మతీన్, పెద్దకొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.