సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని నియోజకవర్గ MLA శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సమయంలో హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉదయం 11 గంటల వరకైనా విధులకు హాజరు కాక పోవటం, హాస్పిటల్ చుట్టూ అపరిశుభ్రత , రిజిస్టర్ మెయింటెన్స్ సరిగా లేకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి జగన్ నాయక్, ఎంపిపి ముడావత్ పార్వతి కొండానాయక్, మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస రెడ్డి, గుండా బ్రహ్మారెడ్డి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.