29.7 C
Hyderabad
April 29, 2024 08: 37 AM
Slider నల్గొండ

అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

#SaidireddyMLA

సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని నియోజకవర్గ MLA శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సమయంలో హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉదయం 11 గంటల వరకైనా విధులకు హాజరు కాక పోవటం, హాస్పిటల్ చుట్టూ అపరిశుభ్రత , రిజిస్టర్ మెయింటెన్స్ సరిగా లేకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్‌పి‌టి‌సి జగన్ నాయక్, ఎం‌పి‌పి ముడావత్ పార్వతి కొండానాయక్, మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస రెడ్డి, గుండా బ్రహ్మారెడ్డి,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సి.ఎం.ఆర్. బియ్యం సత్వరమే అందించాలి

Satyam NEWS

మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం

Bhavani

కడప కేంద్ర రారాగారంలో ఖైదీలకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment