అంగన్వాడీ,ఆశ,మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,అప్పటి వరకు నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, గోదాం సివిల్ సప్లై హమాలీలకి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి,వివిధ కార్మిక సంఘాల నాయకులు కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అంగన్వాడి ఐసిడిఎస్,సిడిపిఓ విజయలక్ష్మి అధికారులకి సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం అంగన్వాడిలతో కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ఈ నెల 28,29వ, తేదీలలో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు,ఎఫ్ టి యు,ఐ ఎన్ టి యు సి,టి ఎన్ టి యు సి ఉద్యోగ సంఘాల నాయకులు శీతల రోషపతి,జడ శ్రీను,బెల్లంకొండ గురువయ్య,ఆకుల నరసింహారావు, యల్క సోమయ్య గౌడ్,రాము, రామ్మూర్తి,రామరాజు,వెంకన్న, మేళ్ళచెరువు ముక్కంటి,జానయ్య తదితరులు పాల్గొన్నారు.
previous post
next post