38.2 C
Hyderabad
May 3, 2024 19: 40 PM
Slider రంగారెడ్డి

మానసిక ఉల్లాసానికి క్రీడలు

ఉప్పల్ నియోజకవర్గంలోని క్రీడల అభ్యున్నతికి, యువతకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం రామంతపూర్ డివిజన్ ఇంద్రానగర్ చిన్న చెర్వు మైదానంలో గంధం ఫౌండేషన్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిలుగా ప్రముఖ సినీనటుడు మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి మాజీ మేయర్ మాట్లాడుతూ
క్రీడలు మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయనీ నియోజకవర్గంలోని క్రీడల అభ్యున్నతికి, యువతకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తాన ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
యువత మొబైల్ ఫోన్ లకు అలవాటు పడి క్రీడల పట్ల ఆసక్తి కోల్పోయి అనారోగ్యంపాలు అవుతున్నారని సినీ నటుడు శివారెడ్డి అన్నారు.
వ్యాయామం,ఆటలు ఆడడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వారిమి అవుతామని ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించి క్రీడాస్ఫూర్తి నెలకొల్పుతున్న నిర్వహకులు గంధం ఫౌండేషన్ చైర్మన్ గంధం నాగేశ్వరరావు ని అభినందించారు.

గంథం ఫౌండేషన్ చైర్మన్ గంథం నాగేశ్వరావు మాట్లడుతూ .మూడురోజులపాటు నిర్వహించే ఈ పోటీలలో ప్రధమ బహుమతి రూ .27౦౦౦ ,ద్వితీయ బహుమతి రూ 7000 రూపాయల బహుమతి ట్రోఫీ ని అందచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లొ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య , అనల హనుమంత్ రెడ్డి ,గోపు సదానంద్ , టిఅర్ఎస్ సినియర్ నాయకులు ఇంద్రసేనా రెడ్డి ,మధుసూదన్ రెడ్డి ,జగదీష్ ,శ్రీనివాస్ రెడ్డి ,రవిచారి,తుట్ నరసింహ,వెంపటి శ్రీను, మనీష్ ,శ్రీనివాస్,సమీర్ ,సాగర్ ,కిరణ్ ,సాయి ,మున్నా ,లడ్డు ,మరియు క్రీడాకారులు అదికసంఖ్యలో పాల్గొన్నారు .
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

సీఎంపై అసభ్య పోస్టులు పెడితే ఆస్తులు అటాచ్ చేస్తాం

Satyam NEWS

వైద్య పరీక్షలకు దొరకని వలసదారులతో కలకలం

Satyam NEWS

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

Satyam NEWS

Leave a Comment