ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న జాతీయ కబడ్డీ క్రీడాకారుడితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని గుణలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు గుణ పోలీసులు తెలిపారు.
అరెస్టయిన క్రిడాకారుడు రింకు జాట్గా పోలీసులు పేర్కొన్నారు. గుణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి క్రెటా కారులో గుణ నుంచి శివపురి వైపు వెళ్తుండగా పట్టుకున్నారు. ముందస్తుగా సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
నిందితుల నుంచి 5 పిస్టల్ మ్యాగజైన్లతో సహా మూడు అదనపు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుర్హాన్పూర్కు చెందిన సిగ్లిగార్ల నుంచి పిస్టల్స్ తీసుకువచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ తుపాకులను సరఫరా చేసిన వ్యక్తి సమాచారం గురించి నిందితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.