నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో గంజాయి మొక్కలు పెంచుతున్న వారిపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గంజాయి మొక్కలు పెంచుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.
శుక్రవారం నాడు ముష్టిపల్లి గ్రామంలో ఎక్సైజ్ శాఖ డి టి ఎఫ్ బృందం వారు ఈ దాడులు నిర్వహించారు. మొత్తం 14 గంజాయి మొక్కలు, 870 గ్రాముల పొడి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు పెంచుతున్న పల్లమోని బాలస్వామి, పల్లమోని శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలియజేశారు.