శాసనమండలి ఎన్నికల్లో నవతరంపార్టీ పోటీ చేస్తుందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులు, ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థులు వివరాలు పరిశీలించి అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.3 పట్టభద్రుల స్థానాల్లో,2 ఉపాధ్యాయులు స్థానాల్లో నవతరంపార్టీ పోటీ పడనున్న అభ్యర్థులు వివరాలకై నేరుగా 9059514700 నెంబర్ లో సంప్రదింపులు జరపాలని,బయోడేటా పంపే వారు navataramparty@gmail.com కు దరఖాస్తులు పంపాలని తెలిపారు. దరఖాస్తులు పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో నవతరంపార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు నలమాల తిరుపతిరావు,కొనతం ఇస్సాకు పాల్గొన్నారు.