మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో పనిచేస్తున్న పద్మశాలి వర్గానికి చెందిన ఉద్యోగి చేత ఆలయ కార్య నిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి కాళ్లు పట్టించుకోవడం ఆయన అహంకారానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయ రావు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ భవన్ నందు ఆయన మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన ఈవోను శివాలయం ఈవోను సాగనంపి తనకు అనుకూలంగా ఉన్న రామకోటిరెడ్డిని ఈవోగా తెచ్చుకున్నారని ఆరోపించారు. అర్చకులకు ప్లేట్ కలెక్షన్స్ రూపంలో వచ్చే మొత్తం నుండి నెలకు 50 వేలు తనకు లంచంగా ఇవ్వాలంటూ ఈఓ రామకోటి రెడ్డి డిమాండ్ చేయటం దారుణమైన చర్య అని అన్నారు.
మధ్యాహ్న భోజనం కాంట్రాక్టర్లతో ఈవో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నిషేధిత గుట్కా పాన్ పరాగ్ నములుతూ ఈఓ రామకోటిరెడ్డి గుడిలోకి ప్రవేశించి అర్చకులు ఉద్యోగులతో కిష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దీనిని బట్టి చూస్తే తన గెస్ట్ హౌస్ లో ఇంకేం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని విమర్శించారు తక్షణమే ఈవో రాంకోటిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.