38.2 C
Hyderabad
May 3, 2024 20: 36 PM
Slider తెలంగాణ

అనథర్ యాంగిల్:నయీమ్ మేనకోడలుసాజీదా మృతిపై అనుమానాలు

shahija nayim

నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు సాజీదా షాహీనా (35) మృతిపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీని ఓవర్ టేక్ చేస్తూ ప్రమాదం జరిగిందని మొదట భావించిన,ప్రమాదం ఓవర్ టేక్ సమయంలో జరిగిందా? లేక కావాలనే ఎవరైనా హత్య చేసి ప్రమాదంగా క్రియేట్ చేశారా? అనే కోణం లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం పలు కేసుల్లో నిందితురాలిగా షాహీనా జైలుకు కూడా వెళ్లి వచ్చింది.షాహీనా పేరిట ఎన్నో ఆస్తులుండగా ఈ ఆస్తులన్నీ నయీమ్, తన దందాలో భాగంగా షాహీనాను బినామీగా పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఆస్తుల్లో ఎన్నో తగాదాలు ఉన్నాయి. ఆ వివాదాల్లో భాగంగా ఎవరైనా షాహీనాను హతమార్చాలన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ చేశారా? అని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి – అద్దంకి జాతీయ రహదారిపై ఓ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఓ గృహ ప్రవేశానికి వెళ్లి, ఆపై మిర్యాలగూడకు వెళుతున్న ఆమె ప్రమాదానికి గురైంది.అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని పోలీసులు నిర్దారించారు.

Related posts

ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దుబ్బాకలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ

Satyam NEWS

ప్రతి ఒక్కరూ ఓటర్ గా పేరు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేస్తున్న సూర్యాపేట ఎస్ పి

Satyam NEWS

Leave a Comment