తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న దళిత బంధు ని ప్రతి కుటుంబానికి వర్తింపజేయాలని తెలంగాణ రాష్ట్ర కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘo డిమాండ్ చేసింది. ఈ పథకం లో ఎంపీ, ఎమ్మెల్యే ల జోక్యం లేకుండా గ్రామ గ్రామనా దండోరా వేయించి గ్రామ సభ ద్వారా అత్యంత నిరు పేదలను గుర్తించి అలాంటి వారికి అందించాలని కోరారు. పేద లబ్ది దారులకు మాత్రమే దళిత బంధు అమలు చేయాలని కొల్లాపూర్ మండల కేంద్రంలో RDO కి వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా RDO ని కోరారు. ఈ కార్యక్రమం లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘo నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు బత్తిని రాజు. పి శివశంకర్ పాల్గొన్నారు.