ఫండ్స్ ట్రాన్స్ ఫర్ ఇక రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ (NEFT) విధానం ద్వారా నగదు బదిలీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్యలోనే చేసుకునే వీలుండేది. ఇప్పుడా సౌలభ్యాన్ని 24 గంటలకు పెంచారు.
రోజులో ఎప్పుడైనా ‘నెఫ్ట్’ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అంతేకాదు, ఏదైనా బ్యాంకుకు సెలవు అయినా ‘నెఫ్ట్’ ద్వారా నిరాటంకంగా నగదు ట్రాన్స్ ఫర్ చేయొచ్చని తెలిపింది. నిరంతరాయ ‘నెఫ్ట్’ సేవలు అందిస్తున్నందుకు ప్రధాన బ్యాంకులు అధిక రుసుములు వసూలు చేయబోవని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. నెఫ్ట్ కు సెలవు కూడా ఉండదు.