అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి కి నిరసగా కడప జిల్లా రాజంపేటలో బుధవారం నాడు జనసేన పార్టీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జీ మలిశెట్టి వెంకట రమణ రాయల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం లో జరిగిన ఈ కార్యక్రమంలో రాజాంపేట పార్లమెంట్ ఇంచార్జ్ యస్. ముక్రం బాషా, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాలతో వైస్సార్ పార్టీ ప్రభుత్వం విధానాలకు నిరసనగా ఈ ప్రదర్శన జరిగింది. వైజాగ్ లో విష వాయువు వల్ల ప్రజలు చనిపోతే వాళ్ళ చావులను డబ్బుకు ముడి వేయడం దుర్మార్గమైన విషయమని మలిశెట్టి వెంకట రమణ రాయల్ అన్నారు.
ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే విద్యుత్ చార్జీలను పెంచడం మరో నిరకుశ వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు. కడపజిల్లా ప్రజలు బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి అక్కడ కరోనా రావడంతో ఇబ్బంది పడుతున్నారని, వాళ్లకు తిండి తిప్పలు లేక అలమటిస్తున్నారని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏ సమస్యకు స్పందించడం లేదని ఆయన అన్నారు.