కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రానందున ముందు జాగ్రత్తలే ముఖ్యమని ఉప్పల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బి ఎల్ ఆర్ ట్రస్ట్ అధినేత బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన బుధవారం చర్లపల్లి డివిజన్ లోని చక్రిపురం కాలనీ, టీచర్స్ కాలనీ, మారుతి కాలనీలలోని అన్ని వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లించారు.
ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్ ,పాల్ రెడ్డి ,రంజిత్ రెడ్డి రాఘవరెడ్డి ,నరసింహ గౌడ్ అశోక్ ,కిషన్ నాయక్ రమణారెడ్డి , తదితరులు పాల్గొన్నారు