ఐఐటీ-జేఈఈ కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్, విద్యా రంగ సలహాదారుడు కే.లలిత్ కుమార్ పుస్తక రూపంలో తీసుకువస్తున్నారు. ఐఐటీ -జేఈఈ కి సంబంధించి 11 సంవత్సరాల అనుభవంతో ఆయన తీసుకువస్తున్న ఈ పుస్తకం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కోసం నిర్దేశించింది.
2014 నుండి 2019 సంవత్సరాల మధ్య కాలంలో జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల వివరాలు ఇందులో ఉంటాయి. మార్కులు ర్యాంకుల వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. మార్కులు ర్యాంకులు చూసుకున్న తర్వాత సీట్లు కేటాయింపు విషయాన్ని ఇందులో వివరించారు. అదే విధంగా ప్రశ్నల కేటాయింపు, కట్ ఆఫ్ మార్కులు, రిజర్వేషన్స్ వారీగా సీట్లు కేటాయింపు తదితర సమగ్ర సమాచారాన్నిఇందులో అందచేస్తున్నారు.
ఈ నెల 13న ప్రముఖ ఐఐటీ -జేఈఈ ఫోరం సహకారం తో పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్ విశేష అనుభవం ఉన్న కే. లలిత్ కుమార్ తన అనుభవాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించారు.