సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో బుధవారం నాడు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, పునర్నిర్మించిన చేసిన సమావేశ మందిరాన్ని, నూతనంగా నిర్మించిన షీ టీమ్ భవనాన్ని మరియు సైబర్ క్రైమ్స్ భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ప్రత్యేక సదుపాయాలతో నూతన సమావేశ మందిరం ఏర్పాటు చేశామని, ప్రజలతో మమేకమయ్యేందుకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా ప్రజలకు అందుబటులోకి ఉండేలా షీ టీమ్ కోసం ప్రత్యేక సదుపాయాలతో నూతన భవనాలను పునర్నిర్మించమన్నారు.
ఈ కార్యక్రమం లో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడ్మిన్ డీసీపీ ఇంధిర, డబ్ల్యూ& సియస్ డబ్ల్యూ డీసీపీ కవిత, డీసీపీ లావణ్య, ఎస్బీ ఏడీసీపీ లు, ఏసీపీ లు, ఇన్స్పెక్టర్లు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.