బాగ్ అంబర్పేట్ డివిజన్ ఎరుకల బస్తీలో డ్రైనేజీ మురికి నీళ్లు పొంగి ప్రవహించడంపై బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి తక్షణమే స్పందించారు. కలుషిత మంచినీటి సమస్యతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు కి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి వాటర్ వర్క్స్ మేనేజర్ మజీద్ తో కలిసి పర్యటించారు. అక్కడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ లోని అనేక ప్రాంతాలలో డ్రైనేజీ నిత్యం పొంగి ప్రవహించే ప్రాంతాలను, కలుషిత మంచినీటి సరఫరా అవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వాటి పరిష్కారానికి తొందరగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షులు చక్క జగన్, ప్రధాన కార్యదర్శి జమ్మిచెట్టు బాలరాజ్, సాయన్న, దేవరుప్పల రమేష్, సునంద, బాలకృష్ణ గౌడ్, వరలక్ష్మి, ముఖేష్ గౌడ్, రాము యాదయ్య, శ్రీనివాస్, డ్రైనేజ్ సూపర్వైజర్ లక్ష్మణ్ ఇంకా అనేక మంది పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్