జగన్ ఒక సైకో… ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుండి మహనీయుల పేర్లతో ఉన్న సంక్షేమ కార్యక్రమాల పేర్లు మార్చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి చెందిన 400 కోట్ల రూపాయిలు నిధులు జగన్ కొట్టేశారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ మహనీయుడు, తెలుగు జాతి కి గర్వకారణం ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది అని లోకేష్ అన్నారు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం తెలుగు జాతి ని అవమానించడమేనని ఆయన అన్నారు. తెలుగు వారికి గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్. దేశంలో మొదట సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఎన్టీఆర్. ఎన్టీఆర్ పేరు మార్చడానికి రహస్య క్యాబినెట్ నిర్వహించారని లోకేష్ అన్నారు. ఇదే పద్దతి కొనసాగితే రాష్ట్రం పేరు కూడా మార్చేసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తో జగన్ చరిత్ర హీనుడు గా మిగిలిపోతాడని లోకేష్ తెలిపారు.