ప్రపంచ శాంతి కోసం జన్మించిన దేవు ఏసు అని, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మానేరు డ్యాం సమీపంలోని బ్లెసింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ చర్చున్న మంత్రి గంగుల, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ పై సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు.
కరీంనగరం ఎస్పీ బంగ్లా సమీపంలోని సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చికి మేయర్ సునీల్ రావుతో కలిసి హాజరై మాట్లాడారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం శాంతియుతంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి ఏసు ప్రభువు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ ను ప్రతి అందరూ సంతోషంగా జరుపుకోవాలని బట్టలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. భావితరాల అభ్యున్నతికి అందరూ కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు.