ధనుర్మాసం ప్రారంభమైన వేళ…ప్రతీ దేవాలయం లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యలనగరమైన విజయనగరం లో కూడా అన్ని దేవాలయాలలో ప్రత్యేక పూజలతో పాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలో విజయనగరం బాబా మెట్టలో వెలసిన ఏడు కోవెళ్లలో ధనుర్మాసం సందర్భంగా “తిరుప్పావడ” సేవ నిర్వహించారు… ఆలయ కమిటీ సభ్యులు.
ఈ మేరకు శివ పంచాయతన దేవాలయం( ఏడ కోవెళ్లు) లో వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసం సందర్భంగా 40 కేజీలు పులిహోర, ఇతర మధుర ఫలాలు, తినుబండారాలతో కలిపి వేంకటేశ్వరుని స్వరూపం లో తయారు చేసన తిరుప్పావడ సేవ నిర్వహించారు. ఈ తెల్లవారుజామున వేకువజామున గోదా దేవి కి, స్వామి వారికి ప్రేత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఈ తిరుప్పావడ సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ సేవా లో పాల్గొని స్వామివారి కీర్తనలు ఆలపించారు.
ధనుర్మాసం ఈ నెల రోజులు ప్రతీ రోజు ప్రత్యేక కార్యక్రమలు నిర్వహిస్తనట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజు తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం అర్చకులు.. భక్తులు కి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల ఆచార్యలు , ఆలయ కమిటీ అధ్యక్షులు కె.ఏ.పి.రాజు(శివ), కార్యదర్శి శివ కుమార్, కోశాధికారి సాంబమూర్తి, నారాయణ రావు, తేజ శర్మ, సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.