భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వారాలను 10 రోజులు పాటు తెరిచి వుంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజులలోనే భక్తులను వైకుంఠ ద్వారం గూండా అనుమతిస్తున్నారు. అయితే భక్తులు రద్దీని దృష్టిలో వుంచుకోని 10 రోజులు పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలను తెరవాలని టిటిడి భావిస్తున్నది.
ఇప్పటికే ఆగమ సలహ మండలి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు గుండా భక్తులను అనుమతించేందుకు అంగీకరించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ప్రాముఖ్యత ఏర్పడింది. పాలకమండలి ఆమోదం పోందితే ఈ ఏడాది నుంచే ఈ నూతన విధానం అమలులోకి వస్తుంది.