28.7 C
Hyderabad
May 6, 2024 10: 42 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త

tirumala 27

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వారాలను 10 రోజులు పాటు తెరిచి వుంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజులలోనే భక్తులను వైకుంఠ ద్వారం గూండా అనుమతిస్తున్నారు. అయితే భక్తులు రద్దీని దృష్టిలో వుంచుకోని 10 రోజులు పాటు వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో ద్వారాలను తెరవాలని టిటిడి భావిస్తున్నది.

ఇప్పటికే ఆగమ సలహ మండలి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు గుండా భక్తులను అనుమతించేందుకు అంగీకరించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ప్రాముఖ్యత ఏర్పడింది. పాలకమండలి ఆమోదం పోందితే ఈ ఏడాది నుంచే ఈ నూతన విధానం అమలులోకి వస్తుంది.

Related posts

నో కరోనా: ఈ సారి మొహర్రం ఊరేగింపులు యథాతధంగా

Satyam NEWS

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Bhavani

రైతులు, యువతను విస్మరిస్తున్న పాలకులు

Bhavani

Leave a Comment