42.2 C
Hyderabad
May 3, 2024 18: 13 PM
Slider హైదరాబాద్

నూతన డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

#kalerumla

అంబర్ పేట డివిజన్ పటేల్ నగర్ చిలుకమ్మ గల్లీలో 14 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా వేయనున్న డ్రైనేజ్  నిర్మాణ పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబర్ పేట డివిజన్ లో అవసరమైన ప్రతి చోట నూతన డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని,స్థానిక ప్రజలకు ఏటు వంటి ఇబ్బంది కలగకుండా డ్రైనేజ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయ్యాలని తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అప్పటి జనాభాకు అనుగుణంగా ఉన్న డ్రైనేజీ పైప్ లైన్ తో ఇప్పటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుండడంతో తీవ్రంగా సమస్య ఉన్న చోట నూతన డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్  వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్,,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,స్థానిక బస్తీ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  

సత్యం న్యూస్, అంబర్పేట్  

Related posts

సమాజహితం కోసం బ్రహ్మకుమారిల కృషి అభినందనీయం

Satyam NEWS

బీజేపీ నాయకుడి ఇంటిపై కొనసాగుతున్న సీబీఐ దాడులు

Satyam NEWS

ఆరోగ్య సిబ్బందిని వేధిస్తున్నపిహెచ్ సి డాక్టర్

Satyam NEWS

Leave a Comment