స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పటేల్ నగర్ క్రాస్ రోడ్డులో మరియు గోల్నాక క్రాస్ రోడ్డులో జరిగిన జయంతి కార్యక్రమాల్లో పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులని, అతి చిన్న వయసులోనే భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రిగా పనిచేసిన మేధావి అని అన్నారు.
ఆయన సంఘ సంస్కర్త మాత్రమే కాక అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమై, వెనుకబడిన వర్గాల వారి హక్కులను సాధించిన మహావీరుడని, భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం పొందుపరచడంలో బాబు జగ్జీవన్ రామ్ కీలకపాత్ర పోషించారని ఎమ్మెల్యే చెప్పారు. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో బాబు జగ్జీవన్ రామ్ కృషిని మరువలేమని కాలేరు వెంకటేష్ పేర్కొన్నారు.
“మీరు నన్ను బంధించగలరు, గాయపరచగలరు కానీ నా మనసుని నియంత్రించలేరు” అంటూ నిర్భయంగా బాబు జగ్జీవన్ రామ్, ప్రజలకు ఇచ్చిన సందేశం మనకు ఎప్పుడూ స్ఫూర్తిని కలిగిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట్