కామారెడ్డి నూతన డిఎస్పీగా వీమూరి సురేష్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మధ్యాహ్నం కామారెడ్డి డిఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు గతంలో ఇక్కడ పని చేసిన డిఎస్పీ సోమనాథం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ కు చెందిన వీమూరి సురేష్ నిన్నటి వరకు బాసర ట్రిపుల్ ఐటిలో డిఎస్పీగా పనిచేశారు. బదిలీల్లో భాగంగా ఆయన కామారెడ్డికి వచ్చారు. 2021 మే 07 న కామారెడ్డి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సోమనాథం 21 నెలల పాటు పనిచేసారు. రేపు డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయనున్నారు. ఇప్పటిదాకా తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన డిఎస్పీ వీమూరి సురేష్ మాట్లాడుతూ.. కామారెడ్డి డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నూతన డిఎస్పీకి పలువురు పోలీసు సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
previous post