ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలో గల గట్టమ్మ దేవాలయం వద్ద మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతర భక్తుల సౌకర్యార్థం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ జాతర ఏర్పాట్లను నిర్వహిస్తుందని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, స్థానిక సర్పంచ్ దాసరి రమేష్ లతో కలిసి గట్టమ దేవాలయం వద్ద జరుగుతున్న జాతర ఏర్పాట్లను ఆయన సోమవారం రోజున పరిశీలించారు. అందులో భాగంగా జడ్పీ చైర్మన్ భక్తుల సౌకర్యార్థం మరుగు దొడ్ల ఏర్పాటు కోసం తన జిల్లా పరిషత్ నిధుల నుండి 3 లక్షల 50 వేల రూపాయలను సర్పంచ్ కోరిక మేరకు అడిగిన వెంటనే మంజూరు చేశారు.
previous post