తిరుమల తిరుపతి దేవస్థానముల జెఈవో(విద్య, ఆరోగ్యం)గా కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె కు చెందిన ఎస్.భార్గవి బుధవారం ఉదయం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జెఈఓ కార్యాలయంలో వేద పండితులు పూజలు నిర్వహించి ఆశీస్సులు అందించారు.
అనంతరం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ కుమార్ సింఘాల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆ తర్వాత టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో పి.బసంత్ కుమార్ , సివి ఎస్ ఓ గోపినాథ్ జెట్టీ లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్.భార్గవి స్వగ్రామం కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె. తండ్రి స్వర్గీయ సుబ్బారాయుడు కాగా తల్లీ వర్ణమ్మ తో పాటు ఓ సోదరి ఉంది.