ఉప్పల్ నియోజకవర్గం ఏ -బ్లాక్ పరిధిలో మహిళా కాంగ్రెస్ మరింత పటిష్ఠం కానుంది. పార్టీ మరింత బలోపేతానికి మహిళా శక్తి తోడ్పడనుందనీ ఉప్పల్ నియోజకవర్గం ఏ -బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మహిళా కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు గోగుల సరిత సమక్షంలో ఏ బ్లాక్ తో పాటు ఇతర డివిజన్ల అధ్యక్షుల నియామకం జరిగింది.
ఉప్పల్ డివిజన్ రేణుక, చిలుకానగర్ డివిజన్ తడి సుశీల, రామంతాపూర్ ఆకుల సంధ్య, నాచారం డివిజన్ టి.ఉమ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలోనే హబ్సిగూడ డివిజన్ అధ్యక్షురాలి నియామకం కూడా చేపట్టనున్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్ ,కంపల్లి బాలరాజ్ ,రఫీక్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు తవీడబోయిన గిరిబాబు ,లింగంపల్లి రామకృష్ణ ,బిక్షపతి చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా