కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్యే ఫోన్ ఇన్ కాల్ లో పాల్గొన్నారు. కొన్ని ఆసక్తికర సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని 10,11 వార్డ పరిధిలో ఉన్న కావలోని కుంట కింద కొందరు వెంచర్ వేస్తున్నారు. ఈ సందర్భంగా చెరువు తూము మూసేశారనీ చర్చకు వచ్చింది. చెరువు నీరు కిందికి పోకుండా తూము ముసేయడంతో ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పట్టణ ఉపాధ్యక్షుడు ఎండి.బాబా ఎమ్మెల్యే కు ఫోన్ చేసి సమస్య చెప్పుకున్నారు. అదేవిధంగా డ్రైనేజీ సమస్య కూడా చెప్పుకున్నారు. దీనితో ఎమ్మెల్యే ఎమ్మార్వో తో మాట్లాడి తూము సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఒక రిఫ్రజెంటేషేన్ ఇవ్వండి అని కూడా చెప్పినట్లు సమాచారం అందింది. అయితే ఆ వెంచర్ ఓ మహిళ కౌన్సిలర్ కు చెందినది అంటున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే బాధితులు మీడియా ముందుకు ఆధారాలతో వస్తామని చెప్పారు.