ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టిన రోజును పురస్కరించుకొని బంజారాహిల్స్ రోడ్ నెం.2 లోని ఇందిరానగర్కు చెందిన కొడిచెర్ల రమేష్ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీఆర్కు పుట్టిన రోజు కానుకగా వారం రోజుల పాటు ఉచితంగా క్షవరాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమం మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని తెలంగాణ భవన్ సమీపంలో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీ వరకుం కేన్సర్ వ్యాధి గ్రస్తులకు, వారి సహాయకులకు, పేద వారికి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా క్షవరాలు చేస్తానని అన్నారు. కేసీఆర్ అంటే తనకు వల్లమాలిన అభిమానమని, దాంతోనే ఇదంతా చేస్తున్నానని అన్నారు.