ఏపీలో ఈ నెల 15 నుంచీ రాత్రి పూట కర్ఫ్యూ మరింత కఠినంగా అమలు జరపాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఈ నెల 12న బాధ్యతలు చేపట్టిన కొత్త ఎస్పీ దీపికా పాటిల్.. నగర రోడ్లపై ఆకస్మికంగా ప్రత్యక్షం అయ్యారు. నగరంలో తొలిసారిగా పర్యటనతో పాటు ఏయే జంక్షన్ లలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా ఆకస్మిక తనఖీ చేసారు. ప్రధానంగా నగరంలో బాలాజీ జంక్షన్ వద్ద పరిస్థితి పరిశీలించారు… కొత్త ఎస్పీ.ఈ ఆకస్మిక పర్యటనలో ఏఎస్పీ సత్యనారాయణ,ఎస్బీ సీఐ రాంబాబు కూడా ఉన్నారు.
previous post