26.7 C
Hyderabad
May 12, 2024 07: 27 AM
Slider ముఖ్యంశాలు

కట్న పిశాచుల చేతుల్లో మరో అబల మృతి

#Archana

వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధింపులు తట్టుకోలేక ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది.

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన నర్సింగారావు, మనోహర్‌ దంపతుల కుమార్తె అర్చన(19)ను రత్నగిరి గ్రామానికి చెందిన కరట్లపల్లి గోపికృష్ణకు ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేశారు.

పెళ్లి సమయంలో రూ.11.50 లక్షలు నగదు, బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. అయితే అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు, మరిది, అత్త తల్లి తీవ్రంగా వేధించసాగారు. మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లొస్తానని అర్చన కోరగా పంపించకుండా దుర్భాషలాడుతూ మానసికంగా వేధించారు.

దీంతో విసిగిపోయిన అర్చన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త గోపికృష్ణతో పాటు, మామ చందర్‌రావు, అత్త హైమవతి, మరిది వంశీ, అత్త తల్లి కమలమ్మలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కే.మహేందర్ గౌడ్,సత్యం న్యూస్

Related posts

ఆలోచించగలిగే బోధన అవసరం

Murali Krishna

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందచేస్తాం

Bhavani

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలల్లో భక్తుల కోసం తలంబ్రాలు

Satyam NEWS

Leave a Comment