28.7 C
Hyderabad
May 5, 2024 07: 10 AM
Slider ప్రత్యేకం

స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్:ఏపీ ఐఐసీ చైర్మన్ రోజా

#RKRoja

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయనగరానికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మైన్ రోజా మీడియా తో మాట్లాడారు. లోక్ సభలో రాజ్యసభలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ లే ఈ అంశంపై వాయిస్ రైజ్ చేస్తున్నారని రోజా అన్నారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్.. ఎంతో మంది త్యాగ ఫలమన్నారు.

స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారని రోజా గుర్తు చేసారు.అందుకే అందరం ఇక్కడకు వచ్చి మద్దతు పలుకుతున్నామన్నారు. చంద్రబాబు విశాఖ వచ్చి ఏదో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు.

ప్రైవేటీ కరణ చేయటానికి వ్యతిరేకమని చెప్పి.. గతంతో వారితోనే చేతులు కలిపారని, కేంద్ర మంత్రి గా అశోక్ గజపతిరాజు ఉన్నాప్పుడే   స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు అడుగులుపడ్డాయని రోజా అన్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేకపోవడమే నష్టాలకు కారణమన్నారు.

గత ప్రభుత్వం దీనిపై ఏం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.స్టీల్ ప్లాంట్ అంశంపై చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని ఏపీఐఐసీ చైర్మన్ రోజా ప్రశ్నించారు. చంద్రబాబు అండ్ కో చేసo అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని రోజా అన్నారు. అందుకే కుప్పం నుంచి బాబుని పంచాయితీ ఎన్నికలలో ప్రజలు తరిమి కొట్టారని అప్పుడే ఆయన సంగతి తేలిపోయిందన్నారు.

Related posts

రంగుమారిన ధాన్యాన్నిషరతులు లేకుండా కొనుగోలు చేయాలి

Satyam NEWS

స్వార్ధం ఎరుగనిది నేత్రదానం ఒక్కటే

Satyam NEWS

రేషన్ బియ్యం పట్టుకున్న మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు

Satyam NEWS

Leave a Comment