కరోనా విజృంభిస్తున్న వేళ ముంబయిలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది.
రేపు రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని ముంబయి మేయర్ పడ్నేకర్ వెల్లడించారు. రాత్రి కర్ఫ్యూ సమయంలో పబ్ లు, హోటళ్లు మూసి ఉంచుతారు.
కేవలం నిత్యావసర సర్వీసులను మాత్రమే రాత్రి వేళల్లో అనుమతిస్తారు.
ఐదు కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదు అయిన నివాస ప్రాంతాలను బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ సీల్ చేస్తుంది.
అక్కడ నుంచి రాకపోకలను నిషేధిస్తారు. కరోనా కు సంబంధించిన ఆంక్షలను మహారాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
ఏప్రిల్ 15 వరకూ కరోనా ఆంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉంటాయి.