‘తెలంగాణ విమోచన’ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ రూరల్ మండల అధ్యక్షుడు కుందూరు కోటిరెడ్డి అన్నారు.
సెప్టెంబర్ 17న మండలంలోని అన్ని పోలింగ్ బూతులలో జాతీయ జెండా ఆవిష్కరించాలని ఆయన కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17 న నైజాం సంస్థానాధీశుల నుండి తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కలిసినందున ఆ రోజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవంగా జరపాలని ఆయన అన్నారు.
నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో, గ్రామాలలోని పోలింగ్ బూతులలో జాతీయ జెండా ఆవిష్కరణ చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ఉర్దూ జగన్, మండల బిజెపి ఉపాధ్యక్షుడు ఎర్ర గాని వీరస్వామి, ఓం గౌడ్ నారాయణ హరీష్ నాగయ్య పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.