35.2 C
Hyderabad
May 11, 2024 18: 29 PM
Slider ప్రత్యేకం

విజయవాడలోనే ఉండి ఎన్నికలు పర్యవేక్షించనున్న నిమ్మగడ్డ

#Dr.Rameshkumar

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరోగ్యంపై అనుమానం వచ్చే విధంగా వార్తలు రాసి ప్రచారం చేస్తున్న వారికి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన చర్యలతోనే సమాధానం చెబుతున్నారు.

ఎన్నికల కమిషనర్ కంటి పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లిపోతున్నారని ఒక వర్గం మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు.

నిజానికి అలాంటిదేం లేదు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం అయ్యారు.

రేపు జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను  వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఆయన పర్యవేక్షించనున్నారు.

ఎస్ఈసీ హైదరాబాద్ కు వెళ్లారని వస్తున్న కథనాలు, వార్తలు అవాస్తవం అని విజయవాడలోనే ఉండి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రుజువు చేస్తున్నారు.

Related posts

టెండర్లతో రాష్ట్రాన్ని దోచేసిన చంద్రబాబునాయుడు

Satyam NEWS

పలు భాషల్లో వరుస సినిమాలతో విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి బిజీ

Satyam NEWS

‘వారాహి’కి పూజలు: నేడు కొండగట్టుకు పవన్‌ కల్యాణ్‌

Satyam NEWS

Leave a Comment