రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరోగ్యంపై అనుమానం వచ్చే విధంగా వార్తలు రాసి ప్రచారం చేస్తున్న వారికి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన చర్యలతోనే సమాధానం చెబుతున్నారు.
ఎన్నికల కమిషనర్ కంటి పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్లిపోతున్నారని ఒక వర్గం మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు.
నిజానికి అలాంటిదేం లేదు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం అయ్యారు.
రేపు జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఆయన పర్యవేక్షించనున్నారు.
ఎస్ఈసీ హైదరాబాద్ కు వెళ్లారని వస్తున్న కథనాలు, వార్తలు అవాస్తవం అని విజయవాడలోనే ఉండి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రుజువు చేస్తున్నారు.