40.2 C
Hyderabad
May 5, 2024 18: 12 PM
Slider ముఖ్యంశాలు

రాజకీయ పార్టీ దిశగా ‘జగనన్న వదిలిన బాణం’

#YSSharimila

వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల రేపు లోటస్‌పాండ్‌లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.

ఈ సమావేశానికి వైఎస్ అభిమానులతో పాటు షర్మిల అనుచరులు కూడా హాజరవుతున్నారు. ఈ మేరకు ఫోన్ల ద్వారా అందరిని ఆహ్వానించారు.

ఈ భేటీ అనంతరం షర్మిల కొత్త పార్టీని ప్రకటించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే రేపటి సమావేశంలో పాల్గొనేందుకు వైఎస్.షర్మిల, బ్రదర్ అనిల్ బెంగళూరు నుంచి లోటస్‌పాండ్‌కు చేరుకున్నారు.

రేపు ఉదయం 10 గంటలకు నల్గొండ జిల్లా వైఎస్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం లోటస్‌పాండ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఏర్పాట్లను నల్గొండ జిల్లా నేతలు పర్యవేక్షిస్తున్నారు. రేపు నల్గొండ జిల్లా నుంచి 5 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

వైఎస్ మరణానంతరం మరుగున పడిన నేతలకు షర్మిల పార్టీతో నూతన ఉత్తేజం రానుంది. షర్మిలను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

కంటి ఆపరేషన్లు చేసుకున్న వారిని పరామర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

దేవీ ఫోటో స్టూడియో చోరీ ఘ‌ట‌న‌లో జువైన‌ల్ పాత్ర‌

Satyam NEWS

మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment