26.7 C
Hyderabad
May 3, 2024 10: 10 AM
Slider కరీంనగర్

‘వారాహి’కి పూజలు: నేడు కొండగట్టుకు పవన్‌ కల్యాణ్‌

#kondagattu

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొండగట్టుఆంజనేయస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా సందర్శిస్తారు. ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ ప్రయాణం అవుతారు. జన సేనాని పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

రామప్ప దేవాలయం అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

అనుకున్న సమయానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందించాలి

Satyam NEWS

బండి సంజయ్ ని తక్షణమే అరెస్టు చేయాలి

Satyam NEWS

Leave a Comment