అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీడియా ముందుకు వచ్చి విద్వేషపూరితమైన మాటలు మాట్లాడి…ప్రజలను మభ్యపెడుతున్నారని…టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు కేఏనాయుడు..గుమ్మడి సంధ్యారాణి లు మాట్లాడారు. ఈ మూడేళ్ళ లో ఉత్తరాంధ్ర కు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ఎంతో మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కు/ఆంధ్రుల హక్కు అయిన స్టీల్ ప్లాంట్ ను…ప్రైవేట్ పరం చేసే ఘనత మీదని నాగార్జున విమర్శించారు.
రాజధాని విశాఖ కు వస్తే ఏదో అభివృద్ధి జరుగుతుందని ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కార్యనిర్వాహక రాజధాని వస్తే మిగిలిన వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అసలు విశాఖ కు ఏం చేసారు…? రాష్ఠ్రాన్ని అతలాకుతలం చేసి…రాజధాని కోసం రైతులు పాదయాత్ర చేస్తుంటే..టీడీపీ అడ్డుకుంటోందని అనడం.. చేతకానితనం అని నాగార్జున ఎద్దేవా చేశారు. అసలు అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలను…అక్కడున్న రైతులంతా సంతోషంగా ధారాదత్తం చేసి..రాజధాని నిర్మాణం కు శంకుస్థాపన జరగడం.. పనులు ప్రారంభమైన సందర్భంగా అధికారంలోకి వచ్చిన మీరు.. మళ్ళీ మీ ప్రాపకం కోసం… మూడు రాజధానులతో నే అదీ వికేంద్రీకరణ తోనే ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయనటం..హాస్యాస్పదంగా ఉందని నాగార్జున అన్నారు.