ప్రత్యక్ష దైవం కొలువైన శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలుఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమిని సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి స్వామి వారి దర్శనానికి తరలివస్తున్నారు. శనివారం తెల్లవారుజామున వేదమంత్రోచ్చారణల మధ్య సూర్యభగవానుడికి పూజారులు క్షీరాభిషేకం నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ పూజల్లో పాల్గొన్నారు.
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యనారాయణస్వామి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది.స్వామివారి పాదాలపై సూర్య కిరణాలు పడటాన్ని ప్రత్యక్షం గా చూసి జనం తరిస్తున్నారు.