తెలంగాణలోనూ మందుబాబులు బారులు తీరారు. సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఎక్కడా కనిపించడం లేదు. లాక్డౌన్ కారణంగా దాదాపు 42 రోజుల తర్వాత హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు ఉత్సాహం చెప్పనలవి కావడం లేదు.
దాదాపుగా అన్ని మద్యం షాపుల వద్దా పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఆసిఫ్ నగర్ డివిజన్ లోని లంగర్ హౌస్, గోల్కొండ, హుమాయూన్ నగర్ ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించారు.
మద్యం కోసం ఉదయం 8 గంటల నుంచే మందుబాబులు షాపుల ముందు బారులు తీరారు. వినియోగదారుల భౌతిక దూరం పాటించేలా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఎక్కడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం లేదు.