కరోనా విపత్కర పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అద్భుత సేవలకు సాయంగా ఉండేందుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా రూ. 50,000 డీడీని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు అందచేశారు.
హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి అందజేసిన తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ నేతలు తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందచేస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ మద్దతునివ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ సమాజాన్ని కాపాడాలని వారు ప్రజలను కోరారు.