రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్. రమేష్ కుమార్ కు ఓటు లేకుండా చేశారు.
తన సొంత ఊరు అయిన గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు నమోదు చేయమని అడిగానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ తెలిపారు.
అయితే స్థానికంగా తాను ఉండటం లేదనే కారణంగా ఓటు హక్కును తనకు అధికారులు ఇవ్వలేదని ఆయన అన్నారు. అధికారుల విచక్షణాధికారాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు.
ఓటు హక్కు నమోదుపై అప్పీల్కు వెళ్తానని, కాదంటే కోర్టుకు వెళ్తామని ఎస్ఈసీ ప్రకటించారు.