సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో జరుగుతున్న అక్రమ లేఅవుట్లను కాపాడాలంటూ భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు.
ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను మున్సిపాలిటీ అధికారులు తొందరలోనే స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో ఫిబ్రవరి పదో తారీకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.