29.7 C
Hyderabad
May 4, 2024 03: 18 AM
Slider హైదరాబాద్

ఫలక్ నుమా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు నోట్ బుక్స్ పంపిణీ

#sunanda

పేద విద్యార్ధులు చదువుతున్న స్కూల్ ను వారు మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం ఆ పాఠశాల విద్యార్ధులకు తమ వంతు సాయంగా నోట్ బుక్స్ అందిస్తుంటారు. ప్రమోద్, వంశీ కృష్ణ హైదరాబాద్ బండ్లగూడా లోని గాంధీనగర్ లో ఉన్న ఫలక్ నుమా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సునందా టీచర్ ఆధ్వర్యంలో అక్కడి విద్యార్ధులకు సాయం చేస్తూ వస్తున్నారు. ప్రమోద్, వంశీకృష్ణ మిత్రబృందం ఈ సారి విద్యార్థుల కోసం నోట్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, స్కేల్స్, క్రేయోన్స్ మొదలైన స్టేషనరీ తీసుకువచ్చి అందించారు.

ఈ మిత్రబృందం ప్రతీ సంవత్సరం ఈ పాఠశాల లోని విద్యార్థులకు కావాల్సినవి అన్ని సమకూరుస్తూ ఉంటారు.  గత యేడాది నోట్ బుక్స్ తో పాటు  నాలుగు ఫ్యాన్స్ కూడా ఇచ్చారు. వీరు ఇలాగే విద్యార్థులకు తమ వంతు సాయం చేస్తూ ఉండాలని ఉపాధ్యాయులు కోరుకున్నారు. పాఠశాల ఇంచార్జి హెడ్ మాస్టారు హనుము నాయక్ ప్రమోద్ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసారు. విద్యార్థులు కూడా తమ సంతోషాన్ని కరతాళధ్వనులతో తెలియ జేశారు. ప్రమోద్ తను వికాసభారతి స్కూల్ లో  చదువుకునే రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ రోజులు ఎంతో సంతోషకరమైనవని, స్కూల్ డేస్ మళ్ళీ రావని, విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని చెప్పారు.

Related posts

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు

Satyam NEWS

నేడు ప్రధాని మోడీ జన్మదినం

Satyam NEWS

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

Leave a Comment