వలంటీర్ల పై రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ… జగన్ ప్రభుత్వం… వలంటీర్ల ను అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా లు చేయమని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా… ఆ ఆదేశాలు.. తదనంతరం ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై విజయనగరం లో ఒక్క సారి ఆందోళనలు కు దిగింది. ఈ మేరకు నగరంలో ని బాలాజీ జంక్షన్ వద్ద…జనసేన నేతలు. .యశస్వి ,రామకృష్ణ, మోహన్ రావులతో జనసేన కార్యకర్తలంతా.. బాలాజీ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు అయితే ఒక్క సారిగా ధర్నా చేస్తున్న. జనసేన పార్టీ… సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో.. అలెర్ట్ అయిన పోలీసులు.. అడ్డుకున్నారు. వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు…. ముందు గానే గ్రహించి.. సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేయడాన్ని ఒక్కసారిగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో. .అటు పోలీసులకు.. ఇటు జనసేన పార్టీ నేతలకు తీవ్ర మైన ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దాదాపు గంటకు పైగా… ఇరువురు మధ్య… తోపులాట, వాదులాట…ఘర్షణ… తొక్కిసలాట చాలా తీవ్రంగా సాగింది. అనంతరం ఘర్షణ తో పోలీసులు పై చేయి సాధించడంతో…జనసేన తగ్గి…నెల్లిమర్ల ఎమ్మెల్యే ను తక్షణమే అరెస్ట్ చెయ్యాలంటూ డిమాండ్ చేశారు.
previous post