కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఏపీ ,కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి లక్షలాది భక్తులు శ్రీశైలానికి విచ్చేయనున్నారు. ఇప్పటికే కర్ణాటక నుంచి పాదయాత్రగా వచ్చే భక్తులచే శ్రీశైల క్షేత్రం కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనానికి సుమారు 12 గంటలు పట్టడంతో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో స్వామివారి అలంకార దర్శనం ఏర్పాటు చేశారు.