రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదివారం హైదరాబాదులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా స్వీటు తినిపించి ఆయనకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి సందర్భంగా రేవంత్ అన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
అన్న చెల్లెలు అక్క తమ్ముళ్లకు సీతక్క రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.