రాష్ట్రంలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందని, ప్రతి ఏడాది ఇదే రీతిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామని చెప్పారు. 2023 జూన్ చివరినాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి, ట్రైనింగ్ ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. 2024 ఫిబ్రవరి నాటికి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశముందని వివరించారు.
previous post
next post