అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణలో భాగంగా ప్రభుత్వ భూములను అమ్మాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భూముల అమ్మకానికి సంబంధించి ఈ నెల 15 న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 25న ప్రీబిడ్ సమావేశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జులై 13 రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ అని 15వ తేదీ ఈ వేలం నిర్వహించనున్నట్లు వివరించింది.
భూముల విక్రయాల్లో భాగంగా కోకాపేటలో 49.95 ఎకరాలు, ఖానామెట్లోని 15.1 ఎకరాలను ప్లాట్లుగా విక్రయించనున్నారు. కోకాపేటలోని భూములను హెచ్ఎండీఏ, ఖాన్మెట్లోని భూములను టీఎస్ఐఐసీ వేలం నిర్వహించనున్నాయి.