ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రస్ పాకిస్తాన్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి.ఈ నెల 16 న అయన పాకిస్తాన్ లో పర్యటిస్తారు.పర్యటన లోభాగం గా ఆయన అక్కడి గురుద్వార దర్బార్ సాహిబ్ను సందర్శిస్తారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్తో అలాగే విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీతో సమావేశమై సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులపై చర్చలు జరపనున్నారు.
పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల అంతర్జాతీయ సదస్సులో గుటెర్రస్ ఈనెల 17వ తేదీన ప్రసంగిస్తారు. శరణార్ధుల పాకిస్తానుకు చేరుకొని 40 ఏళ్ళు దాటడం తో 40వ వార్షికోత్సవం సదస్సు నిర్వహిస్తున్నామని శరణార్ధుల హైకమిషన్ ఫిలిప్పో గ్రాండీ తెలియజేశారు.